. . . 27 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 30 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శనివారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరిచారు. వీరిలో 27 మందికి ఒకరికి రూ.10,000 చొప్పున 270,000/-జరిమనా విధించారని, ఉగ్గెర బాబయ్య, దొడ్ల భాస్కర్, కొమ్ము శ్రీకాంత్ అనే ముగ్గురికి మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
