– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
రుద్రూర్, బతుకమ్మ : దసరా పండుగ రోజు ఉదయం తెల్లవారుజామున రుద్రూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంబేద్కర్ కాలనీలోని అంగన్వాడి సెంటర్ లో రెండు సిలిండర్లు, బియ్యం బస్తాను దొంగతనం చేశారని, ఈ విషయం పై అంగన్వాడి టీచర్ గంగమణి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన రుద్రూర్ ఎస్ఐ సాయన్న దొంగలు ఇద్దరిని పట్టుకుని వాళ్ళిద్దరి నుండి రెండు సిలిండర్ బుడ్డిలను స్వాధీనం చేసుకుని, వారిద్దరిని రిమాండ్ కు తరలించారు.
