వెబ్ న్యూస్, బతుకమ్మ: బిహార్ లో కొత్త ప్రభుత్వం నవంబర్ 19 లేదా 20 తేదీల్లో కొలువు తీరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. కాగా, బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.
