26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జస్టిస్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు.  నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో బీసీ జేఏసీ చైర్మన్ నరాల సుధాకర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జస్టిస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే నినాదంతో ఉదయపు నడక కార్యక్రమం “రన్ ఫర్ సోషల్ జస్టిస్” నిర్వహించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన  కోసం దశల వారి ఉద్యమం కొనసాగుతుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు గంగా కిషన్ కొత్తూరు చంద్రకాంత్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Run for Justice under the auspices of BC JAC

More articles

Latest article