. . . రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనవి. అయితే ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పాలనా వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఆలోచన భారతదేశం కోసం అవసరమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మీడియా తో మాట్లాడుతూ… ఓకే దేశం ఒకే ఎన్నిక అనేది దేశవ్యాప్తంగా సమైక్యతను, సమర్థతను తీసుకురావడమే కాకుండా ప్రజాధనాన్ని కూడా ఆదా చేస్తుందని వివరించారు, మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తుందని పేర్కొంటూ, ముందుకు వెళుతుంది అన్నారు . ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కోట్లాది మంది పేదలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుతోంది. ఉజ్వల యోజన ద్వారా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు లభించాయి. పీఎం కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6,000 నేరుగా ఖాతాలో జమ అవుతుంది. 12 కోట్లకు పైగా టాయిలెట్ల నిర్మాణం ద్వారా స్వచ్ఛ భారత్ గమ్యం చేరుకుంటోంది. జనధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ సదుపాయం తుది పల్లె వరకు చేరింది, అని గణాంకాలతో వివరించారు. ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరి కపటమైనదని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఓబీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధ హోదా ఇచ్చిన ప్రభుత్వం బీజేపీదే. మోదీ ఓబీసీలకు గౌరవం కలిగించేలా విధానాలు రూపొందిస్తున్నారు, అని తెలిపారు.ఇటీవల బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆమెకు జవాబు తండ్రి కేసీఆర్ మాత్రమే చెప్పాలని బీజేపీ కి అటువంటి ఆలోచన గాని చర్చలు గాని జరగలేదు అన్నారు ఈ సమావేశం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన కర్ లక్ష్మి నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్,సాయి వర్ధన్, వెల్డింగ్ నారాయణ, మండల అధ్యక్షుడు తారక్ వేణుగోపాల్, బాలాపురం ఆనంద్ రావు, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

