25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జొన్న పంట కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్

 

మద్నూర్,బతుకమ్మ: మద్నూర్ మార్కెట్ కమిటీ లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం  మార్కుఫెడ్ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు కేంద్రన్ని ఏఎంసి వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పేర్కొన్నారు.  జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటాలు రూ.3371 వేల తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ సీను పటేల్, మీర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రాంపటేల్, హన్మాండ్లు స్వామి, ప్రజ్ఞ కుమార్, సెక్రటరీ బాబు రావు పటేల్, రైతులు నాయకులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article