24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సంతాపం ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని, చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, సౌమ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article