- నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో ఘటన
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : కన్న తండ్రిని కూతురు రోకలి బండతో కొట్టి చంపిన విషాదకర సంఘటన నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నరసయ్య(54) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా కూతురు రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నవీపేట్ ఎస్సై వినయ్ ధర్మారం గ్రామానికి చేరుకొని సంఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు దారి తీసిన వివరాలు ఇంకా తెలియ రాలేదు.
