హైదరాబాద్, బతుకమ్మ : కులగణన సర్వేను అసెంబ్లీలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణనను చేపట్టామన్నారు. మొత్తం 75 అంశాలను ప్రాతపాదికగా తీసుకొని సర్వే నిర్వహించమన్నారు. ఈసర్వే ప్రకారం రాష్ర్టంలో కులాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బీసీలు-46.25 శాతం, ఓసీలు-17.79 శాతం , ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీ మైనారిటీలు 10.08 శాతంగా ఉన్నారు.
కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం
