నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
టైలర్స్ డే పురస్కరించుకుని నగరంలోని హమాల్ వాడి మేరు సంఘం తర్ప ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తర్ప సంఘంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ ఆధ్వర్యంలో దర్జీ వృత్తి నిర్వహించే వారికి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మేరు సంఘం సభ్యులకు ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో తర్ప ఆధ్వర్యంలో కుట్టుమిషన్ ఉంచి టైలర్స్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతురావు, పోల్కం గంగాకిషన్, కొట్టూర్ దేవిదాస్, చంద్రకాంత్, తాళ్ళ శివకుమార్ తదితరులున్నారు.

