నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగుల చికిత్సకు ఉపయోగపడే ఉద్దేశంతో పడకంటి రాము ఫౌండేషన్ ముఖ్యమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ యువ వ్యాపారవేత్త డా. పడకంటి రాము తన టీం సభ్యులు జంగం శ్రీకాంత్ గౌడ్తో కలిసి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్కు రూ. 9,000 విలువైన సక్షన్ మెషిన్ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డా. పడకంటి రాము మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమకు తోచినంత సహాయాన్ని పేద ప్రజల కోసం చేయడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు.
