నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ సిఐడిలో సిఐ ఆంజనేయులు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్ లోని సిఐడి డీజీపీ కార్యాలయంలో సిఐడి డిఐజీ పరిమిల హన నూతన్, హైదరాబాద్ ఎస్పీ డా.బి.నవీన్ కుమార్ లు సిఐ ఆంజనేయులుకు మెమోంటో, శాలువాతో సత్కరించారు. 42 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఆంజనేయులు పని చేసి విజయవంతంగా సర్వీసు పూర్తి చేశారు. ఎస్సైగా విధుల్లో చేరిన ఆంజనేయులు మెదక్, కామారెడ్డి, పిట్లం, సిద్దిపేట్, సంగారెడ్డి, గజ్వేల్ జిల్లాల్లో పని చేశారు. నిజామాబాద్ సిఐడి విభాగంలో సిఐగా ఆంజనేయులు పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు కుటుంబ సభ్యులతో పాటు సిఐడి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
