బతుకమ్మ,ముప్కాల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవి చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని రిక్కల రాజారెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులకు సుమారు రూ.6000 విలువగల టై, బెల్ట్ లను శనివారం ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
