24.1 C
Hyderabad
Monday, August 3, 2026

లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో శుక్రవారం స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ రకాల వర్కింగ్ మోడల్ ఎక్స్పరిమెంట్, ప్రొజెక్టర్ వర్క్ పిరమిడ్స్ తో అందర్నీ ఎంతగానో అలరించారు. విద్యార్థులందరూ ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా వివరించారు, ఈ కార్యక్రమంలో ఫుడ్ పిరమిడ్ మానవ జీర్ణ వ్యవస్థ మూత్రపిండాలు, జంతు ప్రదర్శనశాల, కాలుష్యాన్ని ఎలా అరికట్టడం అంతేకాకుండా గణిత పరికరాలు లెక్కలు సులువుగా చేయడం సులభమైన పద్ధతిలో సూత్రాలను రాబట్టడం, అంతేకాకుండా చిన్నచిన్న పిల్లలు పండ్లు కూరగాయలు వివిధ రకాల వేషాలతో అందర్నీ ఎంతగానో ఆలరించారు. ఈ కార్యక్రమంలో మాన్య అనే విద్యార్థి ఆస్ట్రోనాట్ తయారు చేసి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ, కమిషనర్ రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఈ విధంగా స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరంగా ఉందని, దానిలో భాగంగా విద్యార్థులందరూ స్వయంగా ప్రతిదీ కూడా వర్కింగ్ మోడల్ చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ చాలా బాగా వివరించారని విద్యార్థులను ప్రశంసించారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థుల్లో సబ్జెక్ట్ పట్ల మంచి అవగాహన వస్తుందని తమ పాఠశాలలోని విద్యార్థులు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పి పీ) జి. రామకృష్ణ,  కమిషనర్ రాజు ఉపాధ్యాయులు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article