మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.
