డిల్లీ, బతుకమ్మ : ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టేసింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మూడు నెలల్లో మరోసారి విచారణ జరపాలని స్పష్టం చేసింది. డిశ్చార్జి పిటిషన్ పై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.