వెబ్ న్యూస్, బతుకమ్మ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ పేరుని బీసీసీఐ ఖరారు చేసింది. వైస్ కెప్టెన్ గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లడ్ తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది.
గిల్ (C ), పంత్ (VC ), జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, జూరెల్, సుందర్, శార్దుల్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, అర్షదీప్, కుల్దీప్ ఉన్నారు.
