సీఎంలకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
డిల్లీ, బతుకమ్మ : పాకిస్థానీయులను వెనక్కి పంపించండని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా, హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
