మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని డోన్ కల్ గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒక్క రోజు తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. దీంతో తాము ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి కలిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, ఉపాధ్యాయ బృందం, సీఆర్పి పరిమళ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.