బతుకమ్మ, కోటగిరి : మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం బుధవారం పోతంగల్ గ్రామానికి చెందిన చిట్టెపు రాజు అనే వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కోటగిరి గ్రామ శివారులో ఇసుక ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని డ్రైవర్ రాజు,ట్రాక్టర్ యజమాని సంజీవ్ పటేల్ ల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.