కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం పరిధిలో మహిళలు, యువతులు బతుకమ్మ ఆడుతు సందడి చేశారు. శిశు మందిర్ ఆవరణలో జరిగిన వేడుకల్లో కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిధిగా టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహిళలు కోలాటాలు ఆడుతూ అంగరంగ వైభవంగా రంగురంగుల పూలతో అందంగా పేర్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఉత్తమ బతుకమ్మలకు టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బహుమతులు అందజేశారు.

