కుళ్లిపోయిన గుడ్లు.. పాడైన పౌష్టికాహారం.. కథనానికి స్పందించిన సిడిపిఓ సౌభాగ్య

0 1,279

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం మాగి అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ సౌభాగ్య తనిఖీ చేసి బాలింతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కుళ్ళిపోయిన గుడ్ల  ను బాలింతలకు అందజేస్తున్నట్లు బతుకమ్మ పేపర్లో  వచ్చింది అది నిజమేనా అని ఆరా తీయగా కొందరు మహిళలు నిజమే అని తెలపడంతో  మళ్లీ ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా  తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే స్వయంగా మాకు తెలియజేయాలని తప్పు చేసిన  ఏ ఒక్కరిని క్షమించలేనని సీడిపి ఓ సౌభాగ్య తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో  ఎప్పటికప్పుడు తనిఖీ చేసి  నాణ్యమైన పోస్టుకాహారాలు అందజేస్తామని తెలిపారు.

Rotten eggs.. Spoiled nutritional food.. CDPO Saubhagya responded to the article.

Leave A Reply

Your email address will not be published.