బాసర, బతుకమ్మ : 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీ బాసర (IIIT) నోటిఫికేషన్ విడుదల చేసింది. బాసర క్యాంపస్ లో 1500, మహబూబ్ నగర్ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 31 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 21 చివరి తేదీ. జులై 4న ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేస్తారు. జులై 7న ఫేజ్-1 కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వివరాలకు www.rgukt.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి