ముషీరాబాద్, బతుకమ్మ : ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఒకరి వద్ద నుంచి స్పెషల్ ఆర్ఐ మహేష్ రూ.లక్షా పదివేలు లంచం డిమాండ్ చేశారు. బాధతుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు స్పెషల్ ఆర్ఐ మహేష్ బాధితుడు రామక్రిష్ణ నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
