24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన రిపోర్టర్

Must read

📰 Generate e-Paper Clip

  • తీన్మార్ మల్లన్న దగ్గర రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తింపు
  • రిపోర్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ : జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావుకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే అవి బైటపెడతా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిరూప అనిల్ కుమార్ అనే మహిళతో కలిసి రిపోర్టర్ శ్యామ్ బ్లాక్ మెయిల్ చేసినట్లు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు శ్యామ్ పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు. శ్యామ్ ను అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జ్ ముందు హాజరు పరిచారు. సదరు రిపోర్టర్ తీన్మార్ మల్లన్న దగ్గర పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

More articles

Latest article