రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : చంటి ప్రసన్న కేంద్రం”మేడ్చల్ వారు తెలంగాణ వైభవం అనే పుస్తకాన్ని వెలువరించారు. సిరిసిల్ల జిల్లా కవయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ రాష్ట్ర పండుగ-బోనాలు అనే వ్యాసాన్ని రచించారు. ఈ వ్యాసాన్ని తెలంగాణ వైభవం పుస్తకంలో ప్రచురించి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ ను చీరసారెలతో సత్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని రాణీ ప్రసాద్ ను సత్కరించారు.రాణీ ప్రసాద్ ఇంతక పూర్వం బతుకమ్మ వంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి అనేక వ్యాసాలు రాసి ప్రచురించారు.
