Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 8:03 pm Posted by : ramakrishna

బోనాల విశిష్టత తెలిపిన  రాణీ ప్రసాద్

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : చంటి ప్రసన్న కేంద్రం”మేడ్చల్ వారు తెలంగాణ వైభవం అనే పుస్తకాన్ని వెలువరించారు. సిరిసిల్ల జిల్లా కవయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ రాష్ట్ర పండుగ-బోనాలు అనే వ్యాసాన్ని రచించారు. ఈ వ్యాసాన్ని తెలంగాణ వైభవం పుస్తకంలో ప్రచురించి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ ను చీరసారెలతో సత్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి  పాల్గొని రాణీ ప్రసాద్ ను సత్కరించారు.రాణీ ప్రసాద్ ఇంతక పూర్వం బతుకమ్మ వంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి అనేక వ్యాసాలు రాసి ప్రచురించారు.

Rani Prasad reveals the uniqueness of Bonala