హైదరాబాద్,బతుకమ్మ : తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్ రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈవిషయమై రాష్ట్ర అధినాయకత్వానికి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ అధ్యక్షుడి బరిలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తో పాటు పార్టీలోని సీనియర్ నేతలంతా అధ్యక్ష పదవికి రాంచందర్ రావు పేరు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ..
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదివికి నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాధవన్ మరికొంత మంది నేతలతో కలసి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
