బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను సోమవారం రాత్రి పోలీసులుముందస్తు అరెస్ట్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు తమకు రావలసిన పది సంవత్సరాలవేతన బకాయిలు ఇప్పించి, కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిని, ఇండస్ట్రీమినిస్టర్ శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందజేద్దామని ప్రయత్నిస్తున్న తరుణంలోరాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.ఫ్యాక్టరీ కార్మీకులను అక్రమ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం హేయమైన చర్య అని వారువాపోయారు. కార్మికుల బాధలు ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోని ఫ్యాక్టరీ లే ఆఫ్అయినప్పటి నుండి నేటి వరకు గల బకాయి వేతనాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని నిజాందక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కోరారు
