26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్నూకర్ పాయింట్లపై పోలీసుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • ‘బతుకమ్మ’ ఎఫెక్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డులో గల స్నూకర్ పాయింట్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఒకటో టౌన ఎస్ హెచ్ ఓ రఘుపతి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఈ దాడులు నిర్వహించారు. ‘బతుకమ్మ’ దినపత్రికలో సోమవారం ‘గేమింగ్ సెంటర్లు కావవి.. బెట్టింగ్ అడ్డాలు..’ అనే కథనానికి పోలీసులు స్పందించారు. ఇంచార్జీ కమిషనర్ సింధూశర్మ ఆదేశాల మేరకు బోధన్ రోడ్డులోని స్నూకర్ పాయింట్లపై, శాంతినగర్ ఖిల్లా రోడ్డులోని క్యారం సెంటర్లపై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ లలో అనుమతి లేకుండా గేమ్ ఆడిపిస్తున్ననిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

More articles

Latest article