బాన్సువాడ, బతుకమ్మ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాన్సువాడ పట్టణ కోటగల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తిరుమల దేవస్థానం (టీటీడీ) లో ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయనతో పాటు బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ,బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు ఉన్నారు.
