కమ్మర్ పల్లీ, బతుకమ్మ: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వర్షాకాలం కావున ప్రజలు నివసించే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా మలేరియా విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన సందర్శించి వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాధుల ఎలా వ్యాపిస్తాయి వ్యాపించకుండా ఉండడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలిసేలా ర్యాలీలు నిర్వహించాలని అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్వర్ సూపర్వైజర్ మారుతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
