29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాక్లూర్

మాక్లూర్‌ మండలంలోని చిక్లి గ్రామ పంచాయతీ భవనంలో శుకవ్రారం భూ భారతి రెవెన్యూ సదస్సును మండల డిప్యూటీ తహసీల్దార్‌ పద్మలత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ షఫీ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ షఫీ మాట్లాడుతూ రైతులు భూ సమస్యలను రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవచ్చని పట్టాపాస్‌ బుక్కులో పేర్లు, సర్వే నంబర్‌, తప్పిదాలను సరి చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూములలో ఎటువంట సమస్యలు ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని, తాము పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది మండల రెవెన్యూ సిబ్బంది, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article