అహ్మదాబాద్, బతుకమ్మ : అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని ఎయిరిండియా తెలిపింది. వీటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇవి దొరికితే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో అందులోని 241 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఈ విమానం బీజే ప్రభుత్వ వైద్య కళాశాల భవనంపై కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది చనిపోయారు.
