మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో గురువారం పోచంపాడ్ గ్రామానికి చెందిన మహమ్మద్ అఖిల్ (26) అనే వ్యక్తి పోచంపాడ్ ఎక్స్ రోడ్ లో సోషల్ వెల్ఫేర్ పాఠశాల దగ్గర డివైడర్ ను డీ కొని తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం హెల్మెట్ ధరించకపోవడంతోనే తల పగిలి మృతి చెందాడని, హెల్మెట్ ధరించి ఉంటే చిన్న గాయాలతో ప్రమాదం నుండి బయట పడేవాడని , ఇకనైనా అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, హెల్మెట్ ప్రాముఖ్యత గురించి వాహన దారులు తెలుసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని మెండోరా ఎస్సై పేర్కొన్నారు.
