. . . డబ్బులు రికవరీ చేశాం
. . . అవకతవకలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకుంటాం
. . . ఐకేపి ఏపిఎం బస్వంత్
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో ని ఐకెపి కార్యాలయంలో ఓ గ్రూపులో పదిమంది గ్రూపు సభ్యులకు తెలియకుండానే, ఎలాంటి సంతకాలు లేకుండా సుమారు రెండు లక్షల రూపాయలు డ్రా చేసినట్లు బతుకమ్మ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై ఐకేపీ ఏపిఎం బస్వంత్ మాట్లాడుతూ.. ఓ గ్రూపులో పదిమంది సభ్యులకు సమాచారం లేకుండా, సంతకాలు లేకుండా డబ్బులు డ్రా చేయడం తప్పు అని అన్నారు. బతుకమ్మ పేపర్ లో వార్త వచ్చిన తర్వాతనే నాకు కూడా ఈ విషయం తెలిసిందని, వాళ్ళ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, డబ్బులు కూడా రికవరీ చేశామని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపిఎం అన్నారు. ఇకముందు ఇలాంటివి జరుగవని ఆయన స్పష్టం చేశారు.
