నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని ప్రగతిశీల రైతులకు శుక్రవారం ఎన్పీఎస్ఎస్ మొబైల్ అప్లికేషన్ శిక్షణ కార్యక్రమం సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ స్ట్మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ఎన్పీఎస్ఎస్ (నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్) మొబైల్ అప్లికేషన్ వినియోగిస్తుందని, తెగుళ్ల నిర్వహణలో దాని ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఈ యాప్ని ఉపయోగించడం ద్వారా రైతులు ఎలాంటి ఆలస్యం లేకుండా తెగులును సులభంగా గుర్తించవచ్చని, తక్షణ నియంత్రణ చర్యలను అనుసరించవచ్చని అన్నారు. ఇది పురుగుమందుల ధరను తగ్గిస్తుందని, తెగులు యొక్క సకాలంలో నిర్వహణను నిర్ధారిస్తుందని తెలిపారు. ఇది తెగులును సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. వారు ఈ యాప్ ద్వారా తక్షణమే సలహాలను పొందుతారనితెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.సునీత, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట రెడ్డి, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఉదయశంకర్, సిఐపిఎంసి సుధ, రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా వ్యవసాయ అధికారి, ఏఓ, ఏఈఓ లు పాల్గొన్నారు.

