గాంధారి, బతుకమ్మ : విద్యార్థని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయున్ని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి తెలిపారు. గాంధారి మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు రమేష్ పై శాఖాపరమైన చర్యలు ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు.
