నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత.. మందన్న నది ఉగ్రరూపం

0 14,610

బతుకమ్మ, బోధన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద వరుస వర్షాల కారణంగా 24 గేట్లు ఎత్తివేయడంతో భారీగా నీటిని విడుదల చేశారు. ఫలితంగా మందన్న నది ఉగ్రరూపంతో ప్రవహిస్తూ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రత్యేకంగా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు, గొరిల్లా కాపారులు, రైతులు నది వైపు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాపాయం తలెత్తే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎవరూ నది దరిదాపుల్లోకి వెళ్లరాదని సూచించారు. ఈ నేపథ్యంలో సాలురా తాసిల్దార్ శశిభూషణ్ రాత్రి నుండి ఇప్పటివరకు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్థులకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Nizamsagar gates lifted.. Mandanna River in a state of fury

Leave A Reply

Your email address will not be published.