నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..
నిజామాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి మొదటగా మార్కెట్ కమిటీ లోని ఆయన చాంబర్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఆయనతోపాటు 18 మంది డైరెక్టర్లతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మార్కేటింగ్ అధికారులు, గంజ్ వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.