హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ డెవలప్ మెంట్ కు గవర్నర్ సహయ సహకారాలు ఉండాలని కోరారు. పరిపాలన లో భాగస్వామ్యం కలిగి సహకరించాలని కోరినట్టు ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అంగీకరించారని తెలిపారు.

