26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తల్లీకూతురు అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: భర్త తిట్టాడని తల్లి కూతురు అదృశ్యమైన ఘటన పాల్వంచ మండలం పోతారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్యార వసంత (30) అనే గృహిణి తన భర్త తిట్టాడని అలిగి తన కూతురు హిరణ్య (7) తో సహా ఇంటి నుంచి ఈనెల 24న వెళ్ళిపోయింది. బంధు, మిత్రుల వద్ద ఆమె కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త గ్యార బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

More articles

Latest article