హైదరాబాద్, బతుకమ్మ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయతీలు అయిన యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఏపీ సీఎంకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
