27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇద్దరికి ఎల్ఓసీ లు అందజేసిన ఎమ్మెల్యే వేముల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం షేట్పల్లి గ్రామానికి చెందిన బబ్బూరి నడిపి లింబన్న ఇటీవల యాక్సిడెంట్ కి గురై రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది. నిమ్స్ లో కృత్రిమ కాలు ఏర్పాటు సర్జరీ కోసం రూ. 1,00,000  ఎల్ఓసీ, ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కల్లెడ దినేష్ అతి చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కొరకు రూ.1 లక్ష 50 వేల  ఎల్ఓసీ ఎమ్మెల్యే వేముల మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీలను  సంబంధిత ఇద్దరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బుధవారం వేల్పూర్ లో అందజేశారు. చికిత్స కొరకు ఎల్ఓసీ లను ఎమ్మెల్యే మంజూరు చేయడంతో ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేసారు.

MLA Vemula hands over LOCs to two

More articles

Latest article