నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

0 14,543

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో రూ 37.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను త్వరగా నాణ్యతతో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయింది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, యండి. దావూద్, అలిమొద్దీన్ బాబా, నర్సగొండ, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.