ఘనంగా రాజ్యాంగ దినోత్సవ సంబరాలు

0 12,568

మోర్తాడ్, బతుకమ్మ: దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాంతువాలను తెలియజేస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవన్ని బుధవారం మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, రాజ్యాంగం పుస్తకానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం లో ఉన్న ప్రతి విషయాలు తెలుసుకోవాలని పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు రాములు అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలెం రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.