. . . పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలలి
. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. నిజాంసాగర్ డిస్టిబ్యూటరీ 26, 28/1 ఆయకట్టు పరిధిలో పంట పొలాలకు నీరందడంలేదని, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పోచారం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం రాత్రి ఆయన ఇరిగేషన్ అధికారులను వెంట తీసుకెళ్లి డిస్టిబ్యూటరీ కాల్వలను పరిశీలించారు. డిస్టిబ్యూటరి 26, 28/1 ఆయకట్టు చెరువులు, కుంటలు నింపాలని, కెనాల్ లో నీటి లెవల్ ౩ ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు, అధికారులు ఉన్నారు.

