డిస్టిబ్యూటరీ కాల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

. . . పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలలి . . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : నిజాంసాగర్‌ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. నిజాంసాగర్‌ డిస్టిబ్యూటరీ 26, 28/1 ఆయకట్టు పరిధిలో పంట పొలాలకు నీరందడంలేదని, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పోచారం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం రాత్రి ఆయన ఇరిగేషన్‌ అధికారులను వెంట తీసుకెళ్లి డిస్టిబ్యూటరీ...