మద్నూర్, బతుకమ్మ: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాధితులకు పరామర్శించారు. డోంగ్లి మండలంలోని సిర్పూర్, టాక్లి గ్రామల వరద బాధితులకు వసతి ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తోటి లక్ష్మి కాంతారావు ఆదేశాలతో మిర్జాపూర్ ఆంజనేయ ఆలయంలో వసతి కల్పించారు. ఎమ్మెల్యే పిల్లలకు బిస్కెట్లు అందించి వారి మొహంలో ఆనందాన్ని కలిగించారు. ఈ బాధ మీది మాత్రమే కాదు తనది కూడా, ఇది తాత్కాలికం మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సానుభూతితో స్పందించిన తీరు ప్రజల మనసును తాకింది వారిలో భద్రత భావం కలిగింది. తహసిల్దార్ ఎండి ముజీబ్, ఎస్సై విజయ్ కొండ ఉన్నారు.

