బతుకమ్మ,కమ్మర్ పల్లీ : కమ్మర్ పల్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అయినటు వంటి చైర్మన్ , వైస్ చైర్మన్, డైరెక్టర్ లతో సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ల పనితీరు, కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి స్టడీటూర్ గా సోమవారం బయలుదేరడం జరిగింది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, డైరెక్టర్లు మహిపాల్, సంపత్, జెడి శ్రీనివాస్, బాణావత్ రాములు, లక్మ రంజిత్, చిన్న బాజన్న, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
